SEARCH

    Select News Languages

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    టికెట్ రద్దుతోనూ భారీగా సంపాదించిన రైల్వే శాఖ.. ఏకంగా 2 వేల కోట్లు

    2 years ago

    ||భారత్ రైల్వే||భారత్ రైల్వే కు ఈ-టిక్కెట్లు, కంప్యూటరైజ్డ్ పాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) కౌంటర్ల ద్వారా కేన్సిలేషన్, కన్వీనియెన్స్ ఫీ ద్వారా 2019-20 నుంచి 2022 డిసెంబరు వరకు రూ.1,949.98 కోట్లు వసూలు చేసింది. ఈ-టికెట్ల రద్దు వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022 డిసెంబర్ వరకు 1298.48 కోట్లు వచ్చాయి. 2015  రైల్వే పాసింజర్స్ రూల్స్ ప్రకారం ఈ రుసుమును వసూలు చేస్తునట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటుకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఏసీ తరగతుల్లో ప్రయాణించేనందుకు టికెట్ బుక్ చేసుకుని క్యాన్సల్ చేసుకున్న వారికి రూ. 30 ( నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు) , రూ. 20 (UPI) వసూలు చేస్తున్నట్లు తెలిపారు. నాన్ ఏసీ తరగతిలో ప్రయాణించేందుకు టికెట్ బుక్ చేసుకుని క్యాన్సిల్ చేసుకున్న వారికి రూ. 15 ( బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు) , రూ. 10 (UPI) వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా టికెట్ బుక్ చేసుకునేందుకు టికెట్ కౌంటర్ వద్ద నిలబడాల్సిన అవసరం లేకుండా యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది. రైల్వేస్, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) ద్వారా ఈ మొబైల్ టికెట్ అప్లికేషన్  తయారు చేశారు. Unreserved Ticketing System(UTS) యాప్ ప్రస్తుతం మొబైల్ ఫోన్లో అందుబాటులో ఉంది.
    Click here to Read more
    Prev Article
    SBI | ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు భారీ షాక్..
    Next Article
    TCS Layoffs Clarity | ఆర్థిక మాంద్యం వేళ ఉద్యోగుల తొలగింపుపై టీసీఎస్ కీలక ప్రకటన

    Related Business Updates:

    Comments (0)

      Leave a Comment