SEARCH

    Select News Languages

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Gold Rate: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. పెరిగిన బంగారం ధర..ఎంతంటే ?

    1 year ago

    బంగారం ప్రియులకు మరోసారి షాక్ తగిలింది. మొన్న వరకు స్థిరంగా ఉన్న బంగారం ధర నిన్న కాస్త తగ్గింది. దీంతో ఇంకా తగ్గుతుందని భావించిన కొనుగోలు దారులకు గురువారం పెరిగిన ధరలు షాకిచ్చాయి. గురువారం బంగారం ధరలు పెరిగాయి. దీంతో బంగారం కొనుగోలు దారులకు నిరాశ ఎదురయ్యింది. ఇక తెలంగాణ, ఏపీలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను చూసినట్లయితే..హైదరాబాద్, విశాఖ, విజయవాడ, నగరాలతోపాటు పలు ప్రాంతాల్లో గురువారం 22క్యారెట్ల పసిడి పది గ్రాములకు రూ. 500 వరకు పెరిగింది. దీంతో ఇది రూ. 67,100కు చేరింది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 550 పెరిగి..73,200 దగ్గరకు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో కూడా ఇవే బంగారం ధరలు కొనసాగుతున్నాయి.  దేశ రాజధాని ఢిల్లీలో గురువారం బంగారం ధరలు రిగాయి. 22క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరిగి.. 22క్యారెట్ల బంగారం ధర  రూ. 67,250కి చేరింది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 550 పెరిగి రూ. 73,350కి పెరిగింది.  దేశవ్యాప్తంగా వెండి ధరల్లో మాత్రం గురువారం  ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్ లో ప్రస్తుతం వెండి కిలో ధర రూ. 92,000 ఉంది. 
    Click here to Read more
    Prev Article
    Today Gold Price: మగువలకు గుడ్ న్యూస్ భారీగా తగ్గిన బంగారం ధరలు
    Next Article
    Today Gold Rate: నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..నేటి ధరలు ఇవే

    Related Business Updates:

    Comments (0)

      Leave a Comment