SEARCH

    Select News Languages

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Gold Rates : రూ.75 వేలకు చేరిన బంగారం.. హైదరాబాద్‌లో తులం ధర ఉందంటే..

    1 year ago

    ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న బంగారం ధర పరుగులు పెడుతూ రూ.75 వేల మార్కును చేరుకుంది. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ స్పాట్ మార్కెట్‌లో స్థానిక పన్నులతో కలిపి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,550గా నమోదైంది. ఒక్క రోజులోనే దాదాపు వెయ్యి రూపాయలు పెరిగింది. అంతర్జాతీయంగా బంగారానికి గిరాకీ పెరగటంతో దేశీయంగానూ ధరలు సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితులే బంగారం ధర పెరగటానికి కారణం అని విశ్లేషకులు చెప్తున్నారు. కాగా, హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,310గా ఉంది. 22 క్యారెట్ల బంగారం రూ.వెయ్యి పెరిగి రూ.67,200 వద్దకు చేరింది. వెండి ధర కూడా భారీగా పెరిగింది. ఢిల్లీ స్పాట్ మార్కెట్‌లో కిలో వెండి రూ.86,300గా ఉంది. శుక్రవారం ఒక్క రోజే రూ.1,400 మేర పెరిగింది. పది రోజుల్లోనే రూ.10 వేలు పెరిగిన ధరగత నెల రోజుల్లో బంగారం ధరలు 10 శాతం పెరిగాయి. ఆరు నెలల కాలాన్ని చూసుకొంటే 25 శాతం వరకు ధరలు రికార్డు సృష్టించాయి. గత పది రోజుల్లోనే బంగారం ధర రూ.10 వేలు పెరగటం గమనార్హం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యాపారం సాగదని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. పండుగలతో కొంత మేర పుంజుకొన్నా, ఎన్నికల ఆంక్షలు అమ్మకాలపై ప్రభావం చూపుతాయని అభిప్రాయపడుతున్నాయి.
    Click here to Read more
    Prev Article
    Amazon Great Summer sale : మే 2 నుంచి అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు
    Next Article
    Repo Rate RBI | వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం

    Related Business Updates:

    Comments (0)

      Leave a Comment