SEARCH

    Select News Languages

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    PAN-Aadhar Link : ఆధార్‌తో పాన్ లింక్ గడువును పెంచిన కేంద్రం.. ఎప్పటి వరకు అంటే..

    2 years ago

    ||Image 1||ఆధార్‌తో పాన్ లింక్ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. వాస్తవానికి మార్చి 31 వరకు గడువు ముగియాల్సి ఉండగా, దాన్ని మరో మూడు నెలలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంటే.. జూన్ 30 వరకు ఆధార్-పాన్ లింక్ చేసుకోవచ్చు అన్నమాట. పన్ను చెల్లింపుదారులకు మరింత సమయం ఇచ్చే ఉద్దేశంతో గడువును పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. అప్పటికీ లింక్ చేయకపోతే పాన్‌ నిరుపయోగంగా మారుతుందని స్పష్టం చేసింది. ఇంకా ఆధార్-పాన్ లింక్ చేయనివారు.. రూ.1,000 అపరాధ రుసుముతో అనుసంధానం చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం పాన్ కార్డు ఉన్న ప్రతీ వ్యక్తి ఆధార్‌తో అనుసంధానం చేయాలి. లేకపోతే, ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటి దాకా దేశవ్యాప్తంగా 51 కోట్ల పాన్‌లు ఆధార్‌తో లింక్ అయ్యాయి.
    Click here to Read more
    Prev Article
    భారతీయ ఉద్యోగులకు అమెజాన్ షాక్.. 500 మందికి కంపెనీ నుంచి గుడ్‌బై
    Next Article
    EPFO Interest : ఖరారైన ఈపీఎఫ్ వడ్డీ రేటు.. ఈ ఏడాది ఎంతంటే..

    Related Business Updates:

    Comments (0)

      Leave a Comment