SEARCH

    Select News Languages

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    SGB | బంగారం కొనాలనుకుంటున్నారా.. కేంద్రం తెచ్చిన ఈ స్కీమ్ మీ కోసమే

    2 years ago

    ||ప్రతీకాత్మక చిత్రం||ఈవార్తలు, బిజినెస్ న్యూస్: 2023-24లో సావరీన్ గోల్డ్ బాండ్ (Sovereign Gold Bond)  స్కీమ్  తొలి విడత సబ్‌స్క్రిప్షన్ తేదీ ఖరారైంది. ఈ నెల 19వ తేదీ నుంచి ఈ స్కీమ్ అందుబాటులో ఉండనుంది. ఒక్కో గ్రాముకు రూ.5,926 చొప్పున ధరను నిర్ణయించారు. ఈ స్కీమ్ ఈ నెల 27వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. కేంద్రం తరఫున భారతీయ రిజర్వు బ్యాంక్ (RBI) ఈ బాండ్లను జారీ చేయనుంది. బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో అమ్ముతారు. ఆన్‌లైన్‌లో కొనేవారికి గ్రాముపై రూ.50 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే.. రూ.5,876కు గ్రాము దొరుకుతుంది.ఏమిటీ సావరీన్ గోల్డ్ బాండ్ స్కీమ్?బంగారం కొనుగోళ్లను తగ్గించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2015లో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. సబ్‌స్క్రిప్షన్ ముందు వారం చివర్లో 999 స్వచ్ఛత కలిగిన బంగారానికి ఇండియా బులియన్ అండ్ జువెల్లర్స్ అసోసియేషన్ లిమిటెడ్ నిర్ణయించిన ధర ఆధారంగా గ్రాము రేటును నిర్ణయిస్తారు. కొనుగోలు చేయాల్సినవాళ్లు కనీసం ఒక గ్రామును కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ బాండ్ వయోపరిమితి ఎనిమిదేళ్లు. గడువు ముగిశాక అప్పటి ధరను చెల్లిస్తారు. ఐదేళ్ల తర్వాత కావాలంటే బాండ్‌ను అమ్ముకోవచ్చు. బయట కొనే బంగారానికి వర్తించే కేవైసీ నిబంధనలే వర్తిస్తాయి.ఎవరెవరు ఎంతెంత కొనొచ్చు?- ఒక ఏడాదిలో వ్యక్తులు, హిందూ ఉమ్మడి కుటుంబాలు గరిష్ఠంగా 4 కిలోల వరకు కొనొచ్చు.- ట్రస్టులు 20 కిలోల వరకు కొనుగోలు చేయొచ్చు.
    Click here to Read more
    Prev Article
    Flipkart - Hero Bikes | ఫ్లిప్‌కార్ట్‌లో హీరో బైక్ బుకింగ్ ఆప్షన్.. ఈఎంఐ తదితర సదుపాయాలు కూడా..
    Next Article
    భారతీయ ఉద్యోగులకు అమెజాన్ షాక్.. 500 మందికి కంపెనీ నుంచి గుడ్‌బై

    Related Business Updates:

    Comments (0)

      Leave a Comment